భారతదేశం, ఏప్రిల్ 26 -- తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2026-27 సంవత్సరానికిగానూ అడ్మిషన్స్ ప్రక్రియ మెుదలైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పరిపాలన మండలి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (NSU) వైస్ ఛాన్సలర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూజీ, పీజీ ప్రవేశాల ప్రకటనను విడుదల చేశారు.

ఈ సమావేశంలో ఆయన 'స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్' గురించి, అలాగే యోగా, అబాకస్, వేద గణిత వేసవి శిబిరాల గురించి వివరించారు.

2026-27 విద్యా సంవత్సరానికి గాను Prak-Shastri(ఇంటర్మీడియట్), యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల ప్రకటనకు సంబంధించి విశ్వవిద్యాలయం ఒక బ్రోచర్‌ను విడుదల చేసిందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీని సంస్కృత మాధ్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్...