భారతదేశం, ఆగస్టు 14 -- దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జనగణన 2027' ప్రక్రియలో అత్యంత కీలకమైన అడుగు పడింది. జనాభా సేకరణ (పాపులేషన్ ఎన్యుమరేషన్) రెండో దశలో భాగంగా ప్రజలను అడగబోయే 40 ప్రశ్నల పూర్తి జాబితాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈసారి జనాభా లెక్కల్లో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సమగ్ర కుల గణన చేపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సెన్సస్ యాక్ట్ 1948, సెక్షన్ 8(1) ప్రకారం సంక్రమించిన అధికారాలతో అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారని అందులో పేర్కొన్నారు.

ఈసారి జనగణనలో మునుపెన్నడూ లేని విధంగా కొన్ని కొత్త అంశాలను చేర్చారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) వివరా...