భారతదేశం, మార్చి 30 -- మారుతున్న సామాజిక పరిస్థితులు, సాంకేతికతకు అనుగుణంగా 2027 జనాభా లెక్కల (Census 2027) ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు (FAQs) తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సహజీవనం (లైవ్-ఇన్ రిలేషన్‌షిప్) చేస్తున్న జంటలను వివాహితులుగా గుర్తిస్తారా అనే ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వారు తమ బంధాన్ని ఒక స్థిరమైన బంధంగా భావిస్తే, వారిని భార్యాభర్తలుగానే పరిగణించవచ్చని కేంద్రం తెలిపింది.

సామాజిక మార్పులను అధికారిక లెక్కల్లోకి తీసుకురావడంతో పాటు, ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ మయం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో లివ్-...