భారతదేశం, సెప్టెంబర్ 9 -- సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతే. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 1980ల నాటి రెట్రో ఫోటోల ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. తమ ప్రస్తుత ఫోటోలు 40 ఏళ్ల క్రితం తీస్తే ఎలా ఉండేవో తెలుసుకోవడానికి యూజర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ సరికొత్త లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఆధారిత చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు.

ఈ ట్రెండ్ కేవలం ఫోటోలను మార్చడానికే పరిమితం కాలేదు. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ రెట్రో పిక్స్ పోస్ట్ చేస్తూ, "యాడ్ యువర్స్" (Add Yours) స్టిక్కర్ జోడించి తమ ఫ్రెండ్స్, ఫాలోవర్లను కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలని ఆహ్వానిస్తున్నారు.

సాధారణంగా ఫోటో ఎడిటింగ్ యాప్‌లలో దొరికే వింటేజ్ ఫిల్టర్లకు, ఈ ఏఐ ట్రెండ్‌కు చాలా తేడా ఉంది. చాట్‌జీపీటీ కేవలం ఫోటో రంగ...