భారతదేశం, మార్చి 12 -- వంట గ్యాస్ (LPG) ధరలు పెరగడం, సరఫరాలో ఇబ్బందులు కలగడం సామాన్యులకు కష్టమే కానీ, కిచెన్ అప్లయన్సెస్ కంపెనీ టీటీకే ప్రెస్టీజ్‌ (TTK Prestige) కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ కంపెనీ షేర్లు దాదాపు 30% పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి.

గురువారం (మార్చి 12) ట్రేడింగ్‌లో టీటీకే ప్రెస్టీజ్ షేర్లు వరుసగా రెండో రోజు కూడా 15% పెరిగాయి. గత మూడు రోజుల్లో ఈ షేరు మొత్తం 29.77% లాభపడింది. దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల డిమాండ్.

గత శనివారం ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను దాదాపు 7% పెంచింది. దీంతో మధ్యతరగతి కుటుంబాలు వాడే 14.2 కిలోల సిలిండర్ ధర Rs.913 కి చేరింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ధరలను మార్చి నెలలోనే రెండుసార్లు పెంచారు. ఈ ధరల భారం తట్టుకోలేక చాలామంది ఇండక్షన్ స్టవ్‌లన...