భారతదేశం, ఆగస్టు 5 -- క్రూడ్ ఆయిల్ ధరల పతనం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు సడలడం, ఆసియా మార్కెట్ల జోరుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఆగస్టు 5) లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మునుపటి సెషన్‌లో నష్టాలతో ముగిసినప్పటికీ, అంతర్జాతీయంగా కనిపిస్తున్న సానుకూల పరిణామాలు మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

బుధవారం ఉదయం గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) 24,740 స్థాయి వద్ద ట్రేడవుతూ, నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి ముగింపు (24,555.60) కంటే ఏకంగా 184.4 పాయింట్ల ప్రీమియంతో కొనసాగుతోంది. ఇది భారత మార్కెట్లకు బలమైన ప్రారంభాన్ని (Gap-up start) సూచిస్తోంది.

అటు ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ 3 శాతానికి పైగా, దక్షిణ కొరియా కోస్పి 4 శాతానికి పైగా ఎగబాకాయి. పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు...