భారతదేశం, ఆగస్టు 12 -- మంత్రి ఉత్తమ్‌తోపాటు ఉన్నతాధికారులతో నీటి పారుద‌ల శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. దేవాదుల నుంచి గ‌తంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపుల‌తో ఎత్తిపోత‌లు చేప‌ట్టామ‌ని సమావేశంలో మంత్రి ఉత్తమ్ వివరించారు. దేవాదుల‌, సీతారామ‌ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోత‌ల‌కు సంబంధించి ఏవైనా చిన్న చిన్న స‌మ‌స్యలుంటే అధికారులు వాటి ప‌రిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల‌ని ముఖ్యమంత్రి సూచించారు.

ప‌లు ప్రాజెక్టుల కింద ఒక‌ట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవ‌సాయ భూముల‌కు ప‌రిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని వెంట‌నే చెల్లించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. నీటి పారుద‌ల‌, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించి ముంపు గ్రామాలు, ప‌రిహారం, పున‌రావాసానికి సంబంధించి వాస...