భారతదేశం, ఆగస్టు 3 -- జ్యోతిష్య శాస్త్రంలో దేవగురు బృహస్పతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఐశ్వర్యం, సంతానం, జ్ఞానం, సౌభాగ్యాలకు కారకుడైన గురుడు ప్రస్తుతం చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 11:17 గంటలకు గురు గ్రహం పుష్య నక్షత్రంలోని నాల్గో పాదంలోకి ప్రవేశించనుంది. ఈ స్థానంలో గురుడు ఆగస్టు 18 వరకు కొనసాగుతాడు.

జ్యోతిష్య పరిభాషలో పుష్య నక్షత్రం గురుడికి అత్యంత ప్రియమైనది. ఈ నక్షత్ర పద మార్పు వల్ల కొన్ని రాశుల వారికి బంగారంలాంటి రోజులు రాబోతున్నాయి. "గురుడి ఈ గోచార మార్పు వల్ల ప్రధానంగా నాలుగు రాశుల జాతకులు అపారమైన ధనలాభం పొందడమే కాకుండా, కెరీర్‌లో గొప్ప స్థానానికి చేరుకుంటారు" అని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు. ఆ నాలుగు రాశులు ఏవి, వారి జాతకాల్లో ఎలాంటి సానుకూల మార్పులు రాబోతున్నాయో...