భారతదేశం, మే 22 -- ప్రైవేటు ఉద్యోగులకు పీఎఫ్ (PF) డబ్బులు అత్యవసర సమయంలో కొండంత అండగా నిలుస్తాయి. అయితే, ఆ డబ్బును వెనక్కి తీసుకోవాలంటే ఇప్పటివరకు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ప్రకటన చేశారు. ఇకపై యూపీఐ (UPI) ద్వారా పీఎఫ్ నిధులను తక్షణమే విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

"యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఈపీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకునే సదుపాయానికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ సదుపాయం ద్వారా విత్ డ్రా చేసిన సొమ్ము నేరుగా సభ్యుడి బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది" అని కేంద్ర మంత్రి మంగళవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉండబోతోంది:

బ్యాలెన్స్ చె...