భారతదేశం, ఆగస్టు 12 -- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల నడుమ, నేడు (ఆగస్టు 12) భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) సూచీ సైతం మందకొడి ఆరంభాన్ని సూచిస్తోంది. ఒకవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై నెలకొన్న అనిశ్చితి, మరోవైపు కీలక సముద్ర మార్గాల్లో చమురు నౌకలపై దాడుల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

గత సెషన్‌లో (మంగళవారం) భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీ కీలకమైన 24,500 మార్కు కంటే దిగువకు చేరింది. సెన్సెక్స్ 388.19 పాయింట్లు (0.49%) క్షీణించి 78,154.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 సూచీ 112.10 పాయింట్లు (0.46%) తగ్గి 24,471.70 వద్ద క్లోజ్ అయింది.

లైవ్ చార్ట్ ప్రకారం, భారత మార్కెట్లకు గిఫ్ట్ నిఫ్టీ ప్లాట్ ఆరంభా...