భారతదేశం, జూలై 14 -- హైదరాబాద్ మహా నగరంలో రేయింబగళ్లు కష్టపడుతూ, ఈ-కామర్స్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న డెలివరీ బాయ్స్ (గిగ్ కార్మికుల) సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా చేతులు కలిపాయి. భాగ్యనగరంలో అత్యధికంగా జనాలు తిరిగే... రద్దీగా ఉండే ఐదు ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక 'అశ్రయ్' (విశ్రాంతి) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సోమవారం ఇరు వర్గాలు ఒక అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం ప్రకారం, సదరు విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించడం, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులను వేగవంతం చేయడం మరియు పరిపాలనాపరమైన సమన్వయాన్ని అందించడంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో కష్టపడే కార్మికులకు అ...