భారతదేశం, సెప్టెంబర్ 8 -- హైదరాబాద్ మహా నగరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగర పోలీస్ యంత్రాంగం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరంలో ఎక్కడైనా గణేశ్ మండపాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా సమాచారాన్ని నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సీపీ వెల్లడించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి, భద్రతను పర్యవేక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఉత్సవ నిర్వాహకులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్వాహకులు వెంటనే తెలంగాణ పోలీసు అధికారిక పోర్టల్ policeportal.tspolice.gov.in/index.htmను సందర్శించి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫారమ్‌లో మండపం నిర్మిస్తున్న ప్రదేశం, మండప కమిటీ సభ్యుల వివరాలు, ...