భారతదేశం, సెప్టెంబర్ 13 -- తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ వినాయక చవితి ఉత్సవాలకు సర్వసిద్ధమైంది. సోమవారం(సెప్టెంబర్ 14) నుంచి గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాబోయే 11 రోజుల పాటు భాగ్యనగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి అపార సంఖ్యలో భక్తులు బడా గణపతిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు సమగ్ర ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ ఉత్సవాల నిర్వహణ, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించారు. "సోమవారం నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ అంతటికీ ఐకానిక్‌గా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకునేందుకు రాబోయే 11 రోజుల పాటు న...