భారతదేశం, మార్చి 4 -- ప్రముఖ నటి రాజశ్రీ దేశ్‌పాండే తన ఆరోగ్యం గురించి అభిమానులకు ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తాను రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించడంతో సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని ఆమె తెలిపారు.

బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ రాజశ్రీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ఈ పోస్ట్ మీరు చదువుతున్నారంటే.. నాకు 'ఇన్‌ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా' (గ్రేడ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్) ఉందని మా తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం నాకు వచ్చిందని అర్థం. అదృష్టవశాత్తూ ఒక సాధారణ వైద్య పరీక్ష (Routine Check-up) సమయంలోనే ఇది బయటపడింది. దీనివల్ల ప్రాథమిక దశలోనే దానిపై...