భారతదేశం, జూన్ 6 -- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతం 1.34 కోట్ల జనాభాతో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ భారీ మహానగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఈ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పండ్ల మార్కెట్‌తో పాటే అదే ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి కూడా...