భారతదేశం, సెప్టెంబర్ 6 -- బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ గళమెత్తింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటుగా పలువురు కీలక నేతలు పాల్గొని, కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. 'ఏదైనా సంస్థలో పనిచేసే సాధారణ ఉద్యోగి వరుసగా వారం రోజులు ఆఫీస్‌కు రాకపోతే జీతం కోత విధిస్తారు. మరి ప్రజల ద్వారా ఎన్నికై, ప్రజాప్రతినిధిగా ఉంటూ శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ముఖం చాటేస్తున్న కేసీఆర్‌కు ప్రభుత్వ జీతభత్యాలు ఎందుకు చెల్లించాలి?' అని ఆయన ప్రశ్నించ...