భారతదేశం, సెప్టెంబర్ 16 -- తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆ ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామని అసెంబ్లీలో ప్రకటించారు.

బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రూ. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకుల భూముల వివరాలను ఆయన సభ ముందుంచారు.

'కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో ఉన్న 31 గ్రామాల్లో ఏకంగా 439 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో కేసీఆర్ కుటు...