భారతదేశం, సెప్టెంబర్ 8 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవెల్లి నివాసంపై పోలీసుల సహకారంతో దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ శాసనసభ్యుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రవెల్లికి చేరుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎర్రవెల్లికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ క్రమంలో హైడ్రామా నెలకొంది. ఈ ప్రణాళికలో ప్ర...