భారతదేశం, మే 4 -- భారతదేశంలో కమ్యూనిస్టులకు ఉన్న ఏకైక 'రాజకీయ చిరునామా' కేరళ కూడా ఇప్పుడు వారి చేజారిపోయింది. దశాబ్ద కాలంగా పినరయి విజయన్ సారథ్యంలో కొనసాగుతున్న ఎల్డీఎఫ్ (LDF) పాలనకు కేరళ ఓటర్లు చరమగీతం పాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) ఊహించని రీతిలో 'సెంచరీ' దిశగా దూసుకుపోతుండగా, అధికార కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక కుదేలవుతోంది.

ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ పార్టీలు, ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే, దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రం ఒక్కటి కూడా ఉండదు. ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే కేరళలో 'అధికార మార్పిడి' ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్‌పై ప్రజల్లో గూడుకట...