భారతదేశం, ఏప్రిల్ 1 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే అందనుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఊరించిన కరవు భత్యం (డీఏ - Dearness Allowance) పెంపు ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటన వెలువడితే దాదాపు 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి అదనపు సొమ్ము చేరనుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుంచి పాత తేదీతో అమలులోకి రానుంది.

నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్చి నెలలోనే ఈ పెంపు వస్తుందని ఆశించారు. అయితే అప్పట్లో ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

గతంలో అక్టోబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం డీఏను 55 శాతం నుంచి 58 శాతానికి ...