భారతదేశం, మే 21 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో సీఈఓ పోటీకి అగ్రిమెంట్‌పై జ్యోత్స్న సంతకం చేస్తుంది. దీపను చేయమంటే.. అసలు తనకు సంతకం చేయొచ్చా అని ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. తను 5వ తరగతి వరకు చదువుకుందని కార్తీక్ అంటాడు. ఏదో ఎంబీబీఎస్ చదివినట్లు చెప్పావని వెటకారంగా అంటుంది జ్యోత్స్న.

దానికి పని మనుషులు, ఇస్త్రీ చేసేవాళ్లు, 2 లక్షల స్కూల్ ఫీజు, 25 లక్షల కారులో వెళ్లడంతో నీ చదువు అయింది. కానీ, ఓ మధ్య తరగతి ఆడపిల్లకు రోజు ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా అని దీప అంతవరకు చదువుకోవడం ఎంత కష్టమైందో గొప్పగా చెబుతాడు కార్తీక్. తండ్రి కష్టం చూసి తనకిష్టమైన చదువును ఐదో తరగతిలోనే ఆపేసిందని, నీకు యూనివర్సిటీ డిగ్రీ ఎంతో తనకు ఐదో తరగతి కూడా అంతే అని కార్తీక్ అంటాడు.

నీ చదువు నీకు ఏ జ్ఞాపకాన్ని ఇవ్వలేదు....