భారతదేశం, జూలై 7 -- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాపై ఉన్న బ్లాక్‌ను తక్షణమే తొలగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చిన తర్వాత, న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ ఆదేశాలు ఇచ్చారు.

"నీట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం రేకెత్తించే అవకాశం ఉన్నందునే ఆ అకౌంట్‌ను నిలిపివేశాం" అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. అయితే, ప్రస్తుతం పరీక్షలు ముగిసినందున ఆ ఆందోళనలు లేవని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ శర్మ.. ఖాతాను బ్లాక్ చేయడానికి దారితీసిన ప్రాథమిక కారణం ఇప్పుడు ముగిసిపోయిందని పేర్కొంటూ అకౌంట్‌ను పునరుద్ధరించా...