భారతదేశం, మే 20 -- మన దేశంలో రాజకీయ పార్టీలకు కొదవలేదు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా పుట్టిన పార్టీలను చూశాం. కానీ తొలిసారిగా 'కీటకాల' పేరుతో ఒక డిజిటల్ విప్లవం మొదలైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే స్థాపించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. వీరికి పోటీగా 'నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్' (NPF) కూడా రంగంలోకి దిగడంతో దేశంలో 'మీమ్ పాలిటిక్స్' కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ఈ వింత రాజకీయ పార్టీల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. నిరుద్యోగ యువతను 'బొద్దింకలు' (Cockroaches), 'పరాన్నజీవులు' (Parasites) అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఆ తరువాత సీజేఐ తన వ్యాఖ్యలు ఫేక్ డిగ్రీలను ...