భారతదేశం, ఫిబ్రవరి 7 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ ను నడపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని రూట్లలో ఇది వరకే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం. ఈనెల 8,11 తేదీల్లో కాకినాడ నుంచి నర్సాపూర్ కు వన్ వే స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కాకినాడ నుంచి (ట్రైన్ నెంబర్ 07510) ఈ స్పెషల్ ట్రైన్. సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6. 40 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

కాచిగూడ - నర్సాపూర్ మధ్య నడిచే వన్ వే స్పెషల్ ట్రైన్స్... మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ,అకివీడు భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది....