భారతదేశం, సెప్టెంబర్ 20 -- South Coast Railway Wood Pulp Transport : సరుకు రవాణా రంగంలో భారతీయ రైల్వే మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్నటివరకు రహదారి మార్గం (రోడ్డు మార్గం) ద్వారా సాగిన సరుకు రవాణాను తన వైపునకు తిప్పుకోవడంలో దక్షిణ కోస్తా రైల్వే సఫలీకృతమైంది.

విదేశాల నుంచి దిగుమతి అయ్యే చెక్క గుజ్జు (ఇంపార్టెడ్ వుడ్ పల్ప్) రవాణాను ఇకపై రోడ్డు మార్గానికి బదులుగా సంపూర్ణంగా రైలు మార్గానికి మళ్లించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు మొదటి 'బాస్ట్ రైక్' (BOST Rake) ద్వారా పల్ప్ సరుకును విజయవంతంగా లోడ్ చేసి పంపించారు.

దక్షిణ కోస్తా రైల్వే విజ్ఞప్తి మేరకు.. జూలై 2026లో రైల్వే బోర్డు సరుకుల టారిఫ్ విధానంలో కీలక సవరణలు చేసింది. వుడ్ పల్ప్‌ను 'గూడ్స్ టారిఫ్ క్లాస్-110' (Goods Tariff Class-1...