భారతదేశం, ఆగస్టు 21 -- ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ జోక్యం చేసుకుని పూర్తి నివేదికను కోరడంతో ఈ అంశం పార్టీ అత్యున్నత స్థాయి పరిశీలనకు చేరింది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో ముఖ్యమంత్రి పాత్రను బహిరంగంగా ప్రశ్నించడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి లభిస్తున్న మద్దతును సవాలు చేసిన ఆమె, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పోటీకి సిద్ధమని సంకేతాలిచ్చారు. టికెట్ కోసం మొదలైన ఈ ప్రయత్నం చివరకు పార్టీ సంస్థాగత న...