భారతదేశం, ఏప్రిల్ 25 -- కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రకటిస్తూ.. జెండాను కూడా విడుదల చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న ఇప్పటి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తన సోషల్ మీడియా ఖాతాలో కవిత కొత్త పార్టీపై మీమ్ వదలింది.

మార్కెట్‌లో ఎక్కువగా ఉపయోగించే ఓ కంపెనీకి చెందిన వాటర్ బాటిల్, టూత్ పేస్ట్‌ మీద వచ్చిన డూప్లికేట్ ప్రోడక్ట్స్‌తో కవిత పార్టీని పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు. నేరుగా కవిత పార్టీ పేరును ప్రస్తావించకపోయినా.. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ.

Published by HT Digital Content Services with...