భారతదేశం, జూన్ 21 -- Electric RTC Bus Fire Accident : కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా సాంకేతిక లోపంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. అయితే.. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోనకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8:00 గంటల ప్రాంతంలో 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు కరీంనగర్ శివార్లలోని అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి చేరుకోగానే.. ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమ...