భారతదేశం, సెప్టెంబర్ 7 -- తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా తీవ్ర రాజకీయం రాజుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (తాతా మధు) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, అధికార పక్ష సభ్యులు కలిసి సంఘీభావం తెలిపారు.

ఎమ్మెల్సీ తాతా మధు మాటలను ఖండిస్తూ.. మంత్రి సీతక్క మాట్లాడారు. స్పీకర్ తల్లిని అవమానించడం బాధకరమని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సభ గౌరవాన్ని మంటగలిపేలా ప్రవర్తించినందుకు...