భారతదేశం, మార్చి 24 -- పదో తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి..డెంటిస్ట్‌గా చెలామణి అవుతున్నాడు. ఎంతో మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేశాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అందరూ ఉదయం నుంచి రాత్రివరకు క్లీనిక్ రన్ చేస్తుంటే.. అతడు మాత్రం రాత్రి నుంచి ఉదయం వరకు క్లీనిక్ ఓపెన్ చేసి పెడతాడు. ఈ మోసగాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌కు 20 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. తాను డెంటిస్ట్‌నని నేరెడ్‌మెట్‌లో దుకాణం తెరిచాడు. ఇక అప్పటి నుంచి ఈ పది పాస్ కానీ.. డెంటిస్ట్.. పేషెంట్లకు సేవలు అందిస్తూనే ఉన్నాడు. మార్చి 24న మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(SOT) జరిపిన దాడుల్లో అతని అక్రమ క్లినిక్ బయటపడటంతో అరెస్టు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ ఫేక్ డెంటిస్ట్ రమేష్.. 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు...