భారతదేశం, మార్చి 14 -- హైదరాబాద్: మారుతున్న జీవనశైలిలో శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. ముఖ్యంగా మహిళలు, క్రీడాకారులు ఎదుర్కొనే దీర్ఘకాలిక నొప్పులు, గాయాలకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లో 'ఓఘా హెల్త్' (OGHA Health) ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ ఫిజియో & రీజెనరేటివ్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. అత్యాధునిక వసతులు, అంతర్జాతీయ స్థాయి చికిత్సా విధానాలతో రూపొందిన ఈ కేంద్రాన్ని ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే మాటను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలన్నారు. "నేటి తరం మహిళలు పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రోగాలు రాకముందే నివారి...