భారతదేశం, జూన్ 3 -- న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివాదాస్పద ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై పార్లమెంటరీ కమిటీ ముందు బుక్కయింది. టెండర్ల కేటాయింపులో జరిగిన లోపాలపై ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి సంధించిన ప్రశ్నలకు బోర్డు అధికారులు నీళ్లు నమలడం తీవ్ర దుమారం రేపింది. మంగళవారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ఉదంతం చోటుచేసుకోగా.. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉన్నతాధికారుల పదవులు ఊడాల్సిందేనని ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఏడాది (2025) ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో జారీ చేసిన మూడు ఓఎస్‌ఎం టెండర్లకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని 'విద్య, మహిళలు, చిన్నారులు, యువజన, క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ' ఆదేశించింది. ఇందులో ప్రీ-బిడ్ వివరణలు, సాంకే...