భారతదేశం, ఆగస్టు 20 -- చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పోకు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన 'ఒప్పో రెనో 5' సిరీస్ మోడళ్లలో స్క్రీన్‌పై నిలువు గీతలు (గ్రీన్ లైన్స్) ప్రత్యక్షమవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆ స్మార్ట్‌ఫోన్ల తయారీ లోపాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) ద్వారా నమోదైన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్రం, ఒప్పో గ్వాంగ్‌డాంగ్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ తయారు చేసిన హ్యాండ్‌సెట్లలోని సమస్యలపై దృష్టి సారించింది.

ఈ విచారణలో భాగంగా ఒప్పో ఇండియా సీనియర్ అధికారులను, సాంకేతిక బృందాన్ని కేంద్రం విచారించనుంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి కంపెనీ ఇప్పటివరకు తీసుకున్...