భారతదేశం, జూన్ 7 -- ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'ఆంధ్రా ప్రీమియర్ లీగ్' (APL) కొత్త సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఏపీఎల్ సరికొత్త ఫార్మాట్‌తో, విస్తృత పరిధితో మన ముందుకు వస్తోంది. జూన్ 9వ తేదీ నుంచి ఈ లీగ్ మ్యాచ్‌లు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు సంయుక్తంగా వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో లీగ్ నిర్వహణపై కీలక ప్రకటనలు చేశారు.

గత సీజన్ పోటీలన్నీ కేవలం వైజాగ్ వేదికగానే జరిగాయి. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునేలా మూడు వేర్వేరు నగరాల్లో మ్యాచ్‌లను ప్లాన్ చేశారు. ఉత్తరాంధ్ర,...