భారతదేశం, జూలై 13 -- పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపన్ను రిటర్నులను (ITR) దాఖలు చేసే సమయం ఆసన్నమవుతున్న వేళ ఆదాయపన్ను శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి ఐటీఆర్-1 (సహజ్) ఎక్సెల్ యూటిలిటీని సవరించింది. పాత సరళమైన ఫార్మాట్‌ను అలాగే ఉంచినప్పటికీ, పారదర్శకతను పెంచేందుకు కొన్ని విభాగాలలో మరిన్ని అదనపు వివరాలను (Disclosures) సేకరిస్తోంది. ఇళ్లు, అద్దె ఆదాయం, పన్ను మినహాయింపుల క్లెయిమ్‌లకు సంబంధించిన నిబంధనల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన మార్పుల వివరాలు కింద చూడొచ్చు.

ప్రముఖ పన్ను సలహా సంస్థ 'క్లియర్ టాక్స్' నివేదిక ప్రకారం.. నివాసిత వ్యక్తులై ఉండి (Resident Individuals) ఏడాదికి రూ.50 లక్షల వరకు మొత్తం ఆదాయం ఉన్నవారు ఐట...