భారతదేశం, ఆగస్టు 18 -- దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లలో మాస్టర్స్ డిగ్రీ (MSc) ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) 2027 షెడ్యూల్ వెలువడింది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ ఖరగ్‌పూర్ చేపట్టింది. ఈ క్రమంలోనే ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారిక పోర్టల్ jam.iitkgp.ac.in ప్రారంభించింది. జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (JOAPS) ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జామ్ 2027 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచార బ్రోచర్‌ను ఆగస్టు 22న ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేయనుంది. ఇందులో అభ్యర్థుల అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష విధానం, ఫీజు వివరాలు, సబ్జెక్టులు, అడ్మిషన్ నిబంధనల సమాచారం అందుబాటులో ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5,...