భారతదేశం, మే 29 -- దేశీయ పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఏషియన్ పెయింట్స్ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4)లో అదిరిపోయే లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే నికర లాభంలో 69.15 శాతం వృద్ధిని సాధించి, రూ. 1,185.49 కోట్లకు చేరుకుంది. ఆదాయం, నిర్వహణ లాభాల్లో (EBITDA) కూడా కంపెనీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

మార్చి త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue from operations) 10.62 శాతం పెరిగి రూ. 9,246.70 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ. 8,358.91 కోట్లుగా ఉంది. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరు అయిన 'డెకరేటివ్ బిజినెస్' (Decorative Business) భారత్‌లో 12.4 శాతం అమ్మకాల వృద్ధిని (Volume Growth) సాధించింది. ఇండస్ట్రియల్ కోటింగ్స్ విభాగంలో కూడా వృద్ధి బలంగా ఉండటం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్లలో కూ...