భారతదేశం, జూన్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లో జీవవైవిధ్య (Biodiversity) పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. కేవలం అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలకే పరిమితం కాకుండా.. వాటి వెలుపల ఉన్న వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం సంరక్షణ కోసం 'ఓఈసీఎం' (OECM - Other Effective Area-based Conservation Measures) విధానాన్ని చేపట్టాలని ఏపీఎస్‌బీబీ నిర్ణయించింది.

ఈ సరికొత్త పర్యావరణ పరిరక్షణ విధానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టతనిచ్చారు. 'సాధారణంగా ఒక రక్షిత ప్రాంతం అనేది పూర్తిగా ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ కోసమే కేటాయించబడుతుంది. కానీ, 'ఓఈసీఎం' (OECM) పరిధిలోకి వచ్చే ప్రాంతాలు అలా కాదు. ఇవి స్థానిక సంఘాల వినియోగం, పారిశ్రామిక గ్రీన్ బెల్ట్‌లు లేదా నీటి ని...