భారతదేశం, జూన్ 25 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ హామీల అమలులో భాగంగా 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది.

రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారికంగా వెల్లడించారు. పారదర్శకమైన పద్ధతిలో ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ (డిస్కం) సంస్థల్లో ఈ క్రింది విధంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏపీట్రాన్స్‌కో-200 పోస్టులు

ఏపీజెన్‌కో -100 పోస్టులు

ఏపీఈపీడీసీఎల్-...