ఏపీ ఆలయాల్లో ఆన్లైన్ సేవల విస్తరణ.. జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీ
భారతదేశం, మే 20 -- భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఆలయ నిర్వహణను ప్రోత్సహించడం కోసం, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీతో సహా పర్యావరణ అనుకూల చర్యలను అమలు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని అధికారులను దేవాదాయ శాఖ ఎక్స్-అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అర్జిత సేవలను ప్రవేశపెట్టడంతోపాటు, దర్శనం, సేవలు, ఇతర సౌకర్యాలను వేగంగా, సులభంగా పొందేందుకు ఆన్లైన్ సేవలను బలోపేతం చేయాలని ఆలయ అధికారులకు సూచించారు.
ఆలయ పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలను సమీక్షిస్తూ, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. ఆలయాలు సమాజానికి భారం కాకుండా, సహాయపడే సంస్థలుగా మారాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.