భారతదేశం, సెప్టెంబర్ 10 -- రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకే కాకుండా కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరలో 5 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రోత్సాహకం మార్చి 2027 వరకు వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో రిజిస్టరైన ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను నుంచి ఐదేళ్ల మినహాయింపు కల్పించడం ద్వారా ఈవీల వైపు మళ్లేలా ప్రజలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్ల...