భారతదేశం, ఏప్రిల్ 26 -- ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటం సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. కొన్ని బంకుల్లో నో డీజిల్ కనిపిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో నో పెట్రోల్ బోర్డు అగుపిస్తోంది.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (HPCL, BPCL, IOCL) డీలర్లకు ఇచ్చే సరఫరాలో కోత విధించడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగినా, దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో కంపెనీలు నష్టాలను తగ్గించుకునేందుకు సరఫరాను నియంత్రిస్తున్నాయి.

గతంలో డీలర్లకు ఉన్న క్రెడిట్ సౌకర్యాన్ని కంపెనీలు రద్దు చే...