భారతదేశం, ఏప్రిల్ 26 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పలు చోట్ల 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆదివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంధన సరఫరా, నిల్వలు, పంపిణీ తీరుపై కీలక సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఇంధన సరఫరా గతంతో పోలిస్తే 10 శాతం పెరిగిందని.. అయితే 'ప్యానిక్ బయింగ్' (ఆందోళనతో ముందస్తుగా కొనుగోలు చేయడం) కారణంగానే బంకుల్లో కొరత ఏర్పడుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలో లీటర్ల డీజిల్ అమ్ముడవుతాయి. కానీ, కొరత రాబోతుందన్న ప్రచారంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు ప...