భారతదేశం, మే 23 -- ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి తీవ్రతకు తోడు వడగాలులు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అయితే ఈ భానుడి భగభగల వేళ రాష్ట్రంలో బీర్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం జనం చిల్డ్ బీర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అధికారిక విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బీర్ల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది.

ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. 2025 ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 22.73 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈ ఏడాది 2026 ఏప్రిల్‌లో ఆ సంఖ్య ఏకంగా 29.88 లక్షల కేసులకు చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే కేవలం ఏప్రిల్ నెలలోనే 31.44 శాతం అమ్మకాలు పెరిగాయి.

ఎండల తీవ్రత మే నెలలో మరింత ఎక్కువ కావడంతో బీర్ల డిమాండ్...