భారతదేశం, జూన్ 3 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్-చైర్‌పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న శీల మణి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 'ఆల్-ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్' (AISHE) రిజిస్ట్రేషన్ పొందని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర విద్యాసంస్థలు తక్షణమే AISHE పోర్టల్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే AISHE కోడ్‌లను కలిగి ఉన్న విద్యాసంస్థలు మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తాజాగా ఒక ప్రకటనలో ఉన్నత విద్యామండలి వైస్-చైర్‌పర్సన్ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా కొత్త విద్యాసంస్థలు, ఇంతవరకు రిజిస్టర్ చేసుకోని సంస్థల కోసం 2025-26, 2026-27 విద్యా సంవత్సరాలకు గాను A...