భారతదేశం, ఆగస్టు 7 -- ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ సముద్ర తీరాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖరన్ రఘురామ్ మధ్య కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మచిలీపట్నం, దుగరాజపట్నంలలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డులు హెచ్ఎస్ఎల్ భవిష్యత్ ఎదుగుదలకు అత్యంత కీలకం కానున్నాయి. ఇవి దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భారత్‌ను నౌకా నిర్మాణ రంగంలో స్వయంసమృద్ధి వైపు తీసుకెళ్తాయి.

నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతులు, అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాల్లో కలిపి సుమారు 18 లక్షల పనిదినాలకు తగిన ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నట్లు చంద్రశ...