భారతదేశం, సెప్టెంబర్ 20 -- Andhra Pradesh Heavy Rains Alert : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో క్రమంగా తీవ్రరూపం దాల్చి రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ అల్పపీడనం రోజురోజుకు బలపడుతూ.. సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాతి రోజే, అంటే మంగళవారం నాటికి ఇది మరింత తీవ్రమై 'తీవ్రవాయుగుండం'గా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తీవ్రవాయుగుండం బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేసింది.

ఈ అల్పపీడనం మరియు తీవ్రవాయుగుండం ప్రభావంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా ధారాపాతంగా ...