భారతదేశం, ఆగస్టు 19 -- తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాదాంతం వెనుక రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ మానసిక, ఆర్థిక వేధింపులే ప్రధాన కారణమని తెలుస్తోంది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు విచారణలో సంచలన విషయాలను వెలికితీశారు.

గతంలో నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో మరణించారని భావించినప్పటికీ, అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. సాధిక్ ఖాన్ తన భర్తకు విషమిచ్చి హత్య చేశాడని సౌజన్య స్వయంగా రాసిన లేఖ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కొత్త కోణం అందరినీ షాకింగ్‌కు గురిచేస్తోంది. షూటింగ్ కోసం కార్తికేయను తీసుకెళ్లే సమయంలో సౌజన్యతో సాధిక్ ఖాన్‌కు పరిచయం ఏర్పడింది. దీనినే అత...