భారతదేశం, మార్చి 12 -- తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. BRS పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్పోజ్ చేసింది.

ఈ కేసు విచారణ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి.. దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ చేసి.. తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వెల్లడించారు.

అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారం తీసుకున్నందున.. ఇక మీద ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవరసం లేదని ముగించింది....