భారతదేశం, ఆగస్టు 27 -- ప్రసిద్ధ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ) రూర్కెలా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి మైండ్ బ్లాకింగ్ ఆఫర్లను దక్కించుకున్నారు. ఈ ఏడాది క్యాంపస్ డ్రైవ్‌లో ఒక బీటెక్ విద్యార్థి ఏకంగా రూ.1.31 కోట్ల భారీ ప్యాకేజీని సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.

బీటెక్ కోర్సులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్) విభాగానికి చెందిన విద్యార్థి రూ.83.60 లక్షల వార్షిక ప్యాకేజీని సాధించారు. బీటెక్ విభాగంలో సగటు వేతనం (Average CTC) రూ.15.33 లక్షలుగా నమోదు కాగా, మధ్యస్థ వేతనం (Median CTC) రూ.12.50 లక్షలుగా ఉంది.

మరొకవైపు ఎమ్‌టెక్ కోర్సుల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ఆఫర్లు సాధించారు. ఎ...